– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇప్పటివరకు పనులు ప్రారంభించుకొని లబ్ధిదారులు తక్షణమే ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని సూచించారు. గతంలోనే మార్కౌట్ పనులు పూర్తి చేసుకొని, ఇండ్ల నిర్మాణాలను ఇప్పటివరకు ప్రారంభించని లబ్ధిదారులు పిల్లర్లు, పునాదుల పనులను మొదలు పెట్టాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే వారికి మహిళ సంఘాల ద్వారా రుణాలు అందించడం జరుగుతుందని లబ్ధిదారులకు వివరించారు.
ఈ అవకాశాన్ని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఇంటి నిర్మాణాలను త్వరగా చేపట్టి పూర్తి చేయాలన్నారు. గతంలోనే నిర్మాణాలను చేపట్టి స్లాబుల వరకు పూర్తయిన ఇండ్లకు సంబంధించి మిగతా పనులను కూడా పూర్తిచేసుకుని గృహప్రవేశాలకు సిద్ధంగా ఉండాలన్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా లబ్ధిదారులకు సహకారం అందిస్తూ ఇందిరమ్మ కమిటీ సభ్యులు చొరవ తీసుకోవాలని కోరారు. సమావేశంలో హౌసింగ్ ఏఈ రాకేష్, పంచాయతీ కార్యదర్శి గంగా జమున, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సింగిరెడ్డి శేఖర్, నిమ్మ రాజేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



