- Advertisement -
నవతెలంగాణ – బంజారాహిల్స్…
ప్రస్తుత కాలంలో ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే?అందులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఎంచుకొని ముందుకు సాగుతున్న ఈ కాలంలో కూడా ప్రాచీన ప్రకృతి సిద్ధ ఆరోగ్య సంరక్షణ చిట్కాలు పాటించడం జరుగుతుంది.
బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సిద్ధార్థ యోగ విద్యాలయం స్థాపకులు డా.పద్మ రామచంద్రలు 30 రోజుల డైట్ ప్రకటిస్తూ, నవంబర్ 2 న హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ఎంఈ రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రకృతి ఆరోగ్య మహోత్సవానికి సంబంధించి బ్రోచర్లు శ్యాంసుందర్, కే.డి.అప్పారావు, ఇంద్రాణి, ప్రసాద్లతో కలిసి ఆవిష్కరించి ప్రకటించారు.
- Advertisement -



