- Advertisement -
నవతెలంగాణ – నకిరేకల్
శాలిగౌరారం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పవన్ కుమార్ సందర్శించారు. గ్రూప్ 1 ద్వారా ఎంపికై 7 రోజుల శిక్షణ నిమిత్తం మండలానికి వచ్చిన పవన్ కుమార్ ను తహసీల్దార్ బి. వరప్రసాద్ స్వాగతించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ కార్యాలయం లో నిర్వహించు విషయాలు, పలు రికార్డుల పట్ల పై డిప్యూటీ కలెక్టర్ కు అవగాహన కల్పించారు. అనంతరం సిబ్బందితో కలసి డిప్యూటీ కలెక్టర్ పవన్ కుమార్ ను సన్మానించారు.
- Advertisement -



