- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం సూక్ష్మ నీటిపారుదల గణనా నీటి వనరుల గణన నమోదుపై మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ అధ్యక్షతన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీటి కుంటలు, చెరువులు, వివిధ సూక్ష్మ నీటి పారుదల వనరులను లెక్కించనున్నట్లు తెలిపారు. వీటిని మొబైల్ యాప్ ద్వారా నమోదు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా నీటి వనరుల లభ్యత గురించి తెలియనుందన్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ముజీబ్ , ఏఎస్ఓ దత్తు, ఎన్యుమరెటర్స్ లు పాల్గొన్నారు.
- Advertisement -



