- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
సౌత్ జోన్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు జక్రాన్ పల్లి మండలం కలిగోట్ పూర్వ విద్యార్థి భవ్య శ్రీ ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీ పురుషోత్తమాచారి వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి తెలిపారు. ఎస్ ఆర్ ఎమ్ యూనివర్సిటీ చెన్నై చెంగల్ పట్టు జిల్లాలో ఈ నెల 13 తేదీ నుంచి 19 తేదీ వరకు జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు ఎంపికైన విద్యార్థిని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
- Advertisement -



