- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామానికి చెందిన కొండ రాజమ్మ 2006లో మండల జెడ్పిటిసిగా గెలుపొందారు. అప్పటి నుంచి మహిళ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలుగా కొనసాగుతూ ఎస్సి మహిళా రిజర్వేషన్ లో బుధవారం జరిగిన మూడవ విడత స్థానిక ఎన్నికల్లో కొయ్యుర్ సర్పంచ్ గా పోటీ చేసి విజయం సాధించారు. తనకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రదాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు లకు రాజమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దుద్దిళ్ల కుటుంబం సహకారంతో కొయ్యుర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.
- Advertisement -



