భారతీయులకు క్రికెట్, సినిమానే ఎంటర్టైన్మెంట్ అనే విషయం అందరికీి తెలిసిందే. ఈ రెండింటికి విడదీయలేని అనుబంధం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నటునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వంశీ చాగంటి ఈబిజీ గ్రూప్ ఇర్ఫాన్ఖాన్, హరితో కలిసి టాలీవుడ్ ప్రో లీగ్ను ఏర్పాటు చేశారు. బుధవారం హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో ఎంతో ఘనంగా ‘టాలీవుడ్ ప్రో లీగ్’ ప్రారంభ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లెజెండరీ క్రికెటర్స్ కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా హాజరయ్యారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రో లీగ్ ఫౌండర్స్లో ఒకరైన వంశీ చాగంటి మాట్లాడుతూ,’స్టార్స్ మాత్రమే క్రికెట్ ఆడటం ఇప్పటివరకు చూశాం. సినిమా పరిశ్రమ 24 శాఖల్లో పనిచేసే ఎవరైనాసరే వారి పోస్ట్లను పక్కనపెట్టి అందరూ కలిసి క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుండి పుట్టిందే ఈ టాలీవుడ్ ప్రో లీగ్. ఈ ఐడియాను ‘దిల్’ రాజుకి చెప్పగానే, మంచి ఐడియా వంశీ దీన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేరు, నీ వెనక నేనున్నాను అంటూ అభయమిచ్చారు. ఫిబ్రవరి 13,14,15, 21,22 తేదీల్లో ఐదురోజుల పాటు జరిగే ఈ క్రికెట్ సమరం ఉప్పల్ స్టేడియంలో జరగనుంది.
ఈ పోటీల్లో ఆరు టీమ్లు పాల్గొంటాయి. ఆరు టీమ్లకు టాలీవుడ్లోని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఓనర్స్గా వ్యవహరిస్తాయి. ఆ నిర్మాతలు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్’ అని అన్నారు. ‘మీ అందరి సహకారం ఇలాగే కొనసాగితే భారతదేశమంతటా ఇలాంటి లీగ్లను మా కంపెనీ ఈబిజి కొనసాగిస్తుంది. ఈ క్రికెట్ లీగ్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ఎఫ్డిసి చైర్మెన్ ‘దిల్’ రాజు చేతుల మీదుగా సేవా (వెల్ఫేర్)కార్యక్రమాలకు అందిస్తాం’ అని టాలీవుడ్ ప్రో లీగ్ నిర్వాహకులు ఇర్ఫాన్ఖాన్, హరి అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ, ‘ఈ లీగ్ పేరు టాలీవుడ్ ప్రో లీగే కానీ నా ఉద్ధేశంలో మాత్రం తెలంగాణా సంప్రదాయం ప్రకారం ఇది తెలుగు సినిమా అలయ్-బలయ్ గా ఫీలవుతున్నా. వంశీ వచ్చి ఈ ఐడియా చెప్పగానే ఎంతో మంచిగా అనిపించింది. ఎలాగైనా సరే ఈ టాలీవుడ్ క్రికెట్ లీగ్ను ముందుకు తీసుకువెళ్లి సక్సెస్ చేస్తాను’ అని చెప్పారు.
ఘనంగా టాలీవుడ్ ప్రో లీగ్ షురూ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



