- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి, బిబిపేట్
అభివృద్ధి పథంలో ఉన్న గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలని బిబిపేట మండలంలోని జనగామ యూత్ సభ్యులు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్లను కోరారు. గురువారం జనగామ సర్పంచి మట్ట శ్రీనివాస్, ఉప సర్పంచ్ పాత స్వామీలను జనగామ యూత్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్లు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయడమే కాకుండా, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బోదాస్ సాయికుమార్, శ్రీకాంత్ గౌడ్, డాకురీ తిరుపతి, వడ్ల కృష్ణ, కైరం కొండ అశోక్, పిట్ల పరశురాములు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



