- Advertisement -
బంగ్లాదేశ్కు బీఎన్పీ చైర్మెన్ తారిక్ రెహమాన్
ఢాకా : బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) యాక్టింగ్ చైర్మెన్ తారిక్ రెహమాన్ 17 సంవత్సరాల ప్రవాసం తర్వాత గురువారం ఢాకా చేరుకున్నారు. ఆయన కోసం భారీగా జనం తరలివచ్చారు. హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 300 అడుగుల రోడ్డు సమీపంలో ఆ పార్టీ కార్యకర్తలు, జనం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రెహమాన్ రాక కోసం దేశం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు ఢాకాలో గుమిగూడారు. బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్, మాజీ ప్రధాని బేగం ఖాలీదా జియా కుమారుడే ఈ రెహమాన్. ఈయన ప్రస్తుతం లండన్లో ఉంటున్నారు.
- Advertisement -



