‘ఛాంపియన్’ బ్లాక్బస్టర్ సక్సెస్తో హీరో రోషన్ కెరీర్ కీలక మలుపు తిరిగింది. స్వప్న సినిమాస్ సంస్థ భారీ స్థాయిలో నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా భారీ అంచనాలతో విడుదలై, అంచనాలకి మించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ముఖ్యంగా మైఖేల్ పాత్రలో రోషన్ చూపించిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, స్క్రీన్ ప్రెజెన్స్పై ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా గీతా ఆర్ట్స్ అధినేత, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని వీక్షించి, రోషన్ నటనకు ఎంతగానో ముగ్ధులయ్యారు. ఆయన వ్యక్తిగతంగా రోషన్ను అభినందించడమే కాకుండా, తన బ్యానర్లో రోషన్తో ఒక ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇది రోషన్ కెరీర్లో ఒక మైలురాయి కానుంది. టాలీవుడ్లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ నుంచి వచ్చిన ఈ అవకాశం రోషన్ టాలెంట్కు గొప్ప గుర్తింపుగా నిలిచిందని చెప్పడంలో సందేహం లేదు. అలాగే నిర్మాత నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో కూడా రోషన్ ఓ సినిమా చేయనున్నారు. వరుసగా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలతో అవకాశాలు రావడం రోషన్లో ఉన్న ప్రతిభని చాటుతోంది.



