నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని డి.నిఖిత అండర్-14 బాలికల విభాగంలో రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.మధుపాల్ శుక్రవారం తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని తిరుమన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన నెట్ బాల్ క్రీడ టోర్నమెంట్, సెలక్షన్స్ లో అత్యంత ప్రతిభ కనపరిచిన నిఖిత రాష్ట్ర స్థాయి నెట్ బాల్ క్రీడా పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల 16,17,18 తేదీలలో ఖమ్మం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి నెట్ బాల్ అండర్-14 బాలికల విభాగంలో జరిగే పోటీలలో నిఖిత పాల్గొంటుందని పాఠశాల ఫీజికల్ డైరెక్టర్ రమేష్ గౌడ్ తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైన నిఖిత ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.మధుపాల్, ఫిజికల్ డైరెక్టర్ రమేష్ గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మెల్ల గంగాధర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయుల బృందం అభినందించి, మెమొంటోను అందజేశారు. రాష్ట్ర స్థాయి పోటీలలో నిఖిత మంచి ప్రతిభను ప్రదర్శించి పాఠశాలకు, గ్రామానికి, ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.


