Thursday, April 30, 2026
E-PAPER
Homeజాతీయంఐ-ప్యాక్ ఛైర్మ‌న్‌కు బెయిల్

ఐ-ప్యాక్ ఛైర్మ‌న్‌కు బెయిల్

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఐ-ప్యాక్(పొలిటిక‌ల్ యాక్స‌న్ క‌మిటీ), కో ఫౌండ‌ర్‌, ఛైర్మ‌న్ వినేష్ కుమార్‌కు బెయిల్ ల‌భించింది.గురువారం ఢిల్లీ పాటియాల‌ కోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేసింది. పాటియాలా హౌస్ కోర్టులో అదనపు సెషన్స్ జడ్జి అమిత్ బన్సల్, వినేష్ చందేల్‌కు రూ. 2 లక్షల బెయిల్ బాండ్, అంతే మొత్తానికి పూచీకత్తు బాండ్‌పై బెయిల్ మంజూరు చేశారు. చందేల్ దర్యాప్తుకు సహకరించాడని, అతని సహకారం ఉద్దేశపూర్వకమైనదని ఈడీ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని, సాక్ష్యాలను తారుమారు చేయకూడదని, దర్యాప్తుకు సహకరించాలని కోర్టు షరతులు విధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -