- Advertisement -
నవతెలంగాణ – కాటారం
రేగుల గూడెం గ్రామపంచాయతీలోని దేవరాoపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ అఫ్జల్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆదేశాల మేరకు బి ఆర్ ఎస్ నాయకులు మృతుని కుటుంబాన్ని పరామర్శించి, 25 కేజీల బియ్యం బస్తా సహాయం అందించారు. అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో గాజుల విక్రం, తూటి మనోహర్, బండం లక్ష్మీనారాయణ, ఎండి జావిద్, కామెడీ ప్రమోద్, కొండిపర్తి మురారి, జిముడ వంశీ, చింతల సంతోష్ లు పాల్గొన్నారు.
- Advertisement -



