Saturday, January 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిభిన్న కాన్సెప్ట్‌తో 'మండవెట్టి'

విభిన్న కాన్సెప్ట్‌తో ‘మండవెట్టి’

- Advertisement -

హీరోయిన్‌ కోమలి ప్రసాద్‌ ‘మండవెట్టి’ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇది పవర్‌ఫుల్‌ ఫిమేల్‌ ఓరియెంటెడ్‌ సూపర్‌ నేచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. టస్కర్స్‌ డెన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై శరణ్‌ రాజ్‌ సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ టీమ్‌ లాంఛనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసి, షూటింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతంలో షూటింగ్‌ జరుగుతోంది. ‘మండవెట్టి’తో కోమలి ప్రసాద్‌ తన సినీ కెరీర్‌లో కొత్త భాష, కొత్త సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. సూపర్‌ నేచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ అంశాలతో పాటు మిస్టిసిజం, ఎమోషన్స్‌ కలయికగా ఓ మహిళ ప్రధానమైన కథతో సినిమా తెరకెక్కుతోంది.

మనకు కావాల్సిన దాన్ని కోల్పోవటం వలన కలిగే బాధ, గుర్తింపు, జీవన పోరాటం, వంటి అంశాలను మిళితం చేసి పెర్ఫామన్స్‌కు స్కోప్‌ ఉన్న కథను రూపొందించారు. పెర్ఫామెన్స్‌తో పాటు భావోద్వేగానికి ప్రాధాన్యమున్న ఈ కథంతా కోమలి ప్రసాద్‌ ప్రధానంగా సాగుతుంది. ‘వెల్ల కుదిర’వంటి సెన్సిబుల్‌, సైకలాజికల్‌ మూవీని రూపొందించి ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్‌ శరణ్‌రాజ్‌ సెంథిల్‌ కుమార్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా, భావోద్వేగాలు ప్రధానంగా ఈ సినిమా ఉండనుంది. ఈ సినిమా విషయంలో ఆయన ఎమోషన్స్‌, పాత్రల అంతర్గతభావాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మూవీలో అంశాలు కేవలం ప్రేక్షకులు చూడటానికే కాదు..పాత్రల్లోని భావోద్వేగాలు ప్రతిబింబంగా మెప్పించనున్నాయి అని చిత్రయూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -