- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో బుధవారం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో మున్సిపల్ కమిషనర్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు ఏ విధంగా చేయాలనే అంశాలపై వివరించారు. ఖర్చు చేసిన వివరాలను ఏ విధంగా తెలియజేయాలి, ఎన్నికల ప్రవర్తన నియమావళి పై అభ్యర్థులకు వివరించారు. ఈ సమావేశంలో ఎసిపి సదానందం, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మారెడ్డి, అభ్యర్థులు పాల్గొన్నారు.
- Advertisement -



