నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల : వైద్యులు, సిబ్బంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శనివారం జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఐ ఎం యూ, ఐసీయూ, ఎస్ఎన్ సీయూ, మెటర్నిటీ వార్డుల్లో పరిశీలించి.. రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు. రోజు ఎంత మంది పేషెంట్లు వస్తున్నారో అని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది నిత్యం సమయానుసారంగా అందుబాటులో ఉండాలని సూచించారు. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు తెలియజేయాలని పేర్కొన్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆరా తీశారు.
చిన్నారితో ఉన్న మహిళతో మాట్లాడారు. ఆసుపత్రికి ఎప్పుడు వచ్చారు? పాప ఆరోగ్య పరిస్థితి తదితర అంశాలు అడిగి తెలుసుకున్నారు.ఐఎంయూ వార్డులో చికిత్స పొందుతున్న బాలుడు, బాలికతో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ఏ అనారోగ్య సమస్యతో వచ్చారో.. ఆరా తీసి.. ఎక్కడి వరకు చదువుకున్నారు. అడిగి తెలుసుకున్నారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ఐటీఐలో స్వయం ఉపాధి కోర్సులు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వారు పూర్తి వివరాలతో వెళ్లి కలవాలని తెలిపారు. కోర్సుల్లో ఉచిత విద్య ఉంటుందని, మంచి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. పరిశీలనలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, వైద్యులు సంతోష్, సుమన్ మోహన్ రావు, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.



