- Advertisement -
నవతెలంగాణ – బల్మూరు
మండల పరిధిలోని కొండనాగుల గ్రామంలోని గంగా గౌరీ రామలింగేశ్వర దేవాలయం వద్ద వారం రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలు జయప్రదం చేయాలని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. దేవాలయం వద్ద 48వ వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 13 నుండి 18 వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కొప్పు లక్ష్మీనారాయణ, అంబటి లింగయ్య, అంబటి బుచ్చయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏడు లాగే ఈ సంవత్సరం కూడా వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
- Advertisement -



