- Advertisement -
– పాఠశాలలు ప్రారంభం రోజే విద్యార్థులకు అందజేత: ఎంఈఓ ప్రసాదరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ ఏడాది పాఠశాల లు ప్రారంభానికి ముందే పాఠ్య,రాత పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి అని,బడి ప్రారంభం రోజే విద్యార్థులకు అందిస్తామని ఎంఈఓ ప్రసాదరావు తెలిపారు. గురువారం స్థానిక విద్యావనరుల కేంద్రం లో విద్యార్థులు కు అవసరమైన రాత పుస్తకాలు ను ప్రధానోపాధ్యాయులు కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం ఏడు రకాల రాత పుస్తకాలు విద్యార్థులు కు ఇస్తామని తెలిపారు. 1,2 తరగతులు కు మూడు,3,4,5 తరగతులు కు నాలుగు,6,7 తరగతులు కు ఆరు,8 వ తరగతి కి ఏడు,8,10 తరగతులు కు పద్నాలుగు చొప్పున రాత పుస్తకాలు పంపిణీ చేస్తామని అన్నారు.
- Advertisement -



