- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 31 స్థానాలను గెలుచుకుని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 14 స్థానాలకు, బీజేపీ ఒక స్థానానికి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక స్థానానికి, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానానికి పరిమితమయ్యారు. 18వ వార్డులో బూడిద సైదులు ఒక్క ఓటు తేడాతో గెలవడంతో రీకౌంటింగ్ నిర్వహించారు, అయినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి బూడిద ప్రజలు గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.
- Advertisement -



