- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
జహీరాబాద్ ఎంపీ సురేష్ సెట్కార్ కు సర్పంచ్ మాధవరావు శాలువతో ఘనంగా సత్కరించారు. ఎంపీ మద్నూర్ మండలాన్ని సందర్శించి మండలంలోని మూడు రాష్ట్రాల సరిహద్దులో గల సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో సర్పంచ్ నేరుగా ఆలయానికి చేరుకుని ఎంపీని కలిశారు. అదేవిధంగా ప్రత్యేకంగా సన్మానించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. గ్రామంలోని సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే, పరిష్కరిస్తానని, గ్రామాభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.
- Advertisement -


