నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
మలబార్ గోల్డ్ , డైమండ్స్ నిజామాబాద్ షోరూంలో 6 వార్షికోత్సవ సందర్భంగా స్టోర్ ఇంచార్జ్ అక్షయ్, మేనేజర్ ఫెర్రోస్ లు వినియోగదారులచే నెక్లెస్ మేళాను ప్రారంభింప చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 13 నుండి 22 వరకు నెక్లెస్ మేళ ప్రదర్శన నిర్వహిస్తారని, ఆభరణాల అద్వితీయమైన కళానైపుణ్యతతో అంతులేని హుందాతనంతో కూడినవి నగిషీ చెక్కి తయారు చేసినవని అన్నారు.
22 క్యారెట్ల పాత బంగారు నగల మార్పిడి పై 0% తగ్గింపు. ఈ పరిమిత కాలపు ఆభరణాల ప్రదర్శనలో అద్భుతమైన బంగారు రత్నాలు , వజ్రాలతో కూడిన నెక్లెస్ ఆభరణాల లభిస్తాయని, ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు , ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100 శాతం విలువ , బంగారం మార్పిడిపై 0 తగ్గింపు, నూరు శాతం బి.ఐ.ఎస్ హాల్ మార్కుతో ధృవీకరించిన వజ్రాభరణాలు, బైబ్యాక్ గ్యారెంటీ, నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్ ఎనలైజర్, జీవితకాల నిర్వహణ , బాధ్యతాయుతమైన మూలాల నుండి బంగారం సేకరణ వంటి వాగ్దానాలను అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



