స్టే ఎత్తివేసిన హైకోర్టు
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
ఉత్కంఠ, భారీ పోలీసు బందోబస్తు మధ్య రెండు, మూడు రోజులుగా హైటెన్షన్ క్రియేట్ చేసిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మెన్ ఎన్నికకు హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. ఎన్నికపై ఉన్న స్టేను ఎత్తివేసింది. కిడ్నాప్నకు గురైనట్టు సాగిన హైడ్రామాకు తెరపడింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని పోలీసులు బుధవారం ఉదయం హైకోర్టులో హాజరుపరిచారు. ఫలితాలు వెల్లడైన తర్వాత బలవంతంగా తనను రెండు రోజులు చీరాలలోని రిసార్ట్లో ఉంచారని, హైకోర్టు ఉత్తర్వులతో రెండు రోజుల క్రితం కౌన్సిల్ మీటింగ్కు హాజరయ్యానని ఆకుల యాదగిరి హైకోర్టు ఎదుట తెలిపారు. చైర్మెన్, వైస్ చైర్మెన్ల ఎన్నికపై విచారణ జరిపిన కోర్టు స్టేను ఎత్తివేసింది. జిల్లా కలెక్టర్దే తుది నిర్ణయమని ప్రకటించింది. కలెక్టర్ నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.



