నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్
మండలంలోని కుకునూరు ఉన్నత పాఠశాల 9, 10వ తరగతి విద్యార్థులకు కుకునూరు గ్రామంలోని శివాజీ యూత్ వారు” చత్రపతి శివాజీ” జయంతిని పురస్కరించుకొని పరీక్ష అట్టలను పంపిణీ చేశారు. 35 మంది విద్యార్థులకు ప్యాడ్, రెండు పెన్నులు, స్కేలు పెన్సిల్, ఎరైజరు,షార్ప్నర్, అందించినట్లు పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు టి. హరిచరణ్ గురువారం తెలిపారు. శివాజీ యూత్ అధ్యక్షులు ర్యాడ రుచిత్ మాట్లాడుతూ రాబోయే సంవత్సరాంత పరీక్షలకు విద్యార్థులకు లోటు రాకుండా తమ యూత్ సభ్యులందరము కలిసి, విద్యార్థులకు పరీక్ష అట్టలు సామాగ్రిని అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పతాని గంగాధర్, శ్రీధర్ రావు నాగరాజు రవీందర్,హరిత, చరణ్ దాస్, మల్కన్నా, యూత్ సభ్యులు మహేందర్, రాజు,రఘు, వంశీ, నిషిత్, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పరీక్ష అట్టల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



