కల్లుగీత కార్మిక సంఘానికి మంత్రి పొన్నం హామీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గీత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చినట్టు తెలంగాణ గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణ, ఉపాధ్యక్షులు వి వెంకటనర్సయ్య తెలిపారు. గురువారం హైదరాబాద్లో మంత్రిని కలిసి గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ నెల 17న ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష చేసినట్టు, కార్మికులు ఎదుర్కొంటున్న 14 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించినట్టు మంత్రి దృష్టికి తీసుకుపోయారు.
వృత్తిలో ప్రమాద బాధితులకు ఇవ్వాల్సిన పెండింగ్ ఎక్సిగ్రేషియాలకు డబ్బులు మంజూరు చేసామని త్వరలో బాధితులందరికీ పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. కాటమయ్య రక్షణ కవచం 40 వేల వరకు ఇచ్చామనీ, వృత్తి చేసే వారందరికీ ఇచ్చేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు, నీరా కేఫ్ త్వరలో ప్రారంభిస్తామనీ, సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడారు. మిగతా అంశాలు పరిష్కారం కోసం తగిన కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రికి కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ అభినందనలు తెలియజేసింది. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి పత్రాలు అందజేశారు.
గీత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



