- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ
లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ నూతన కార్యవర్గ సభ్యులను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ నూతన అధ్యక్షులుగా యాదగిరి గౌడ్, సెక్రెటరీగా కనకయ్య గౌడ్, ట్రెజరర్ గా రంగరి రమాకాంత్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ ఙ్ఞాన సాగర్ రెడ్డి తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులు సంవత్సరం పాటు లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ వివిధ సేవా కార్యక్రమాలు, క్లబ్ నిర్వహణ నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజియన్ సెక్రటరీ చాకులింగం, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



