హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న తొలి చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మాత. కో ప్రొడ్యూసర్గా తవిటిరాజు తలచింతల వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్ రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్ర ముహూర్తపు షాట్కు శ్రీధర్ పెద్దిరెడ్డి క్లాప్ కొట్టారు. స్రవంతి పెద్దిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, శ్రీ హన్సిక పెద్దిరెడ్డి దర్శకుడికి స్క్రిప్ట్ను అందజేశారు. ఈ చిత్రంలో జగన్ యోగి రాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటులు దేవీ ప్రసాద్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ,’సినిమా అనేది నాకు ఒక కల. ఒక అభిరుచి. ఒక బాధ్యత. ఇదొక అందమైన ఎంటర్టైన్ మెంట్ లవ్ డ్రామా. ప్రేమ, భావోద్వేగాలు, వినోదం ఈ మూడు ఎలిమెంట్స్తో ప్రేక్షకులను అలరించేలా ఈ కథను ఎంపిక చేసుకున్నాం. ప్రతి యువకుడి మనసుకు దగ్గరయ్యే భావాలు, ప్రతి కుటుంబం ఆస్వాదించే వినోదం ఈ చిత్రంలో ఉంటాయి. మంచి కథకు ప్రాధాన్యం ఇస్తూ, టెక్నికల్గా ఉన్నత ప్రమాణాలతో, నాణ్యమైన నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కి స్తున్నాం. కొత్త ప్రతిభకు అవకాశం ఇవ్వడమే కాకుండా, అనుభవజ్ఞులైన టెక్నీషియన్ల సహకారంతో ప్రతి ఫ్రేమ్ అందంగా కనిపించేలా కషి చేస్తున్నాం’ అని అన్నారు.
సరికొత్త లవ్ ఎంటర్టైనర్
- Advertisement -
- Advertisement -



