నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట కాంప్లెక్సుస్థాయి బాలమేళా 2.0 స్థానిక ప్రాధమిక పాఠశాలలో సోమవారం నిర్వహించారు. కాంప్లెక్సు పరిధి లోని 14 పాఠశాలల నుండి విద్యార్ధులు పాల్గొన్నారు. విద్యార్ధుల సమగ్రఅభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని 1 వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్ధులకు తెలుగు, ఇంగ్లీషు, గణితంలలో సామర్ధ్య ఆధారిత పరీక్ష నిర్వహించి తరగతికి ఒక్కరు చొప్పున మండలస్థాయి పోటీలకు ఐదుగురిని ఎంపిక చేశారు. అదేవిధంగా గ్రంధాలయ అభ్యసన నైపుణ్యాలను పరీక్షించేందుకు కథా విన్యాసాన్ని నిర్వహించారు. ఈ పోటీలో అత్యంత ప్రతిభ కనబర్చిన ఐదుగురు విద్యార్ధులను ఎంపిక చేశారు. బాలమేళా ముగింపు సభ కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత అధ్యక్షతన నిర్వహించి మండలస్థాయికి ఎంపిక అయిన విద్యార్ధులకు మెడల్, ప్రశంసాపత్రం, బహుమతులను అందించారు.
ఈ సందర్భంగా కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు హరిత మాట్లాడుతూ విద్యార్ధుల పునాది బలంగా ఉంటేనే భవిష్యత్తు స్థిరంగా ఉంటుందని భాషా నైపుణ్యాలు, గణిత భావనలు పెంపొందించడంలో ఎఫ్.ఎల్.ఎన్ కార్యక్రమం ఎంతగానో ప్రభావం చూపుతుందని విద్యార్ధుల ప్రతిభను వెలికితీయడానికి బాలమేళా దోహదం చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రిసోర్సు పర్సన్లు శ్రీశైలం(సిద్ధు), పరబ్రహ్మాచారి, కాంప్లెక్సు కార్యదర్శి బి.విసత్యనారాయణ, సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు,ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


