- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్నూర్ పట్టణ కేంద్రంలోని దక్షిణ కాశీ శ్రీ సిద్ధరామేశ్వర ఆలయంలో ఆలయ అర్చకులు కోడెంకల్ రామగిరి శర్మ, కోడెంకల్ సిద్ధగిరి శర్మ, న్యాలకొండ రాజేశ్వర్ శర్మలు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేసినట్లు తెలిపారు. తిరిగి ఆలయాన్ని బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆలయ సిబ్బంది లక్ష్మీనారాయణ, లక్ష్మి, లక్ష్మి, గోపీ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



