Thursday, March 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' విజయవంతం చేయండి

‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ విజయవంతం చేయండి

- Advertisement -

– జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ రామకృష్ణరావు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మార్చి 6 నుంచి జూన్‌ 12 వరకు జరగనున్న ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్‌.అంబేద్కర్‌ సచివాలయం నుంచి కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కిందిస్థాయి సిబ్బంది నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు అందరూ సమన్వయంతో పని చేసేలా కార్యచరణ రూపొందించాలని సూచిం చారు. 99 రోజుల పాటు సాగే ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ అయిదు దశల్లో జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకం గా చేపట్టే ఈ కార్యక్రమం నిర్వహణపై ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఇన్‌చార్జి మంత్రితో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి, జిల్లాలోని ప్రముఖ ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. ఈనెల 12న ఆయా జిల్లాల్లో నూతనంగా ఎన్నికైన మున్సిపల్‌ చైర్మెన్లు, మేయర్లు, వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచులకు అవగాహనా సదస్సులు నిర్వహించాలని అన్నారు. ఇందుకుగాను పంచా యతీరాజ్‌, మున్సిపల్‌శాఖలు ప్రత్యేకఏర్పాట్లు చేస్తా యని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమన్వయంతో అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజరు కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, మున్సిపల్‌ పట్టణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి టీకే. శ్రీదేవి, ప్రణాళిక శాఖ ప్రత్యేక కార్యదర్శి గౌరవ్‌ ఉప్పల్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -