- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష మే 17న జరగనుంది. ఐఐటీ రూర్కీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. భారతీయ విద్యార్థులకు ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఉంటాయి. విదేశీ విద్యార్థులకు ఏప్రిల్ 6 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అడ్మిట్ కార్డులు మే 11 నుంచి అందుబాటులో ఉంటాయి. పరీక్ష రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. జూన్ 1, 2026న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
- Advertisement -



