Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలపై ప్రజావాణిలో ఫిర్యాదు

ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలపై ప్రజావాణిలో ఫిర్యాదు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 12లో అసైన్మెంట్ భూమిని, తహశీల్దార్ కార్యాలయం పక్కన సర్వేనెంబర్ 3లో ప్లాట్ నెంబర్ 4ను ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలు కబ్జా చేశారని సోనాల గ్రామస్థుడు కాలె వెంకట్ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. అంతకుముందు జనవరి 24న కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు కూడా వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా కాలె వెంకట్ మాట్లాడుతూ.. వీరు మండల పరిధిలో రెండు ఫ్లాట్లను కబ్జా చేసి, దానిని వారి తల్లిపేరుపై రిజిస్టర్ చేయించారని తెలిపారు. అంతేకాకుండా ప్రూఫ్ కోసం ఆ స్థలానికి టాక్స్ కూడా కట్టారని అన్నారు. ఒక భాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగులై ఉండి, ఇంత దిగజారి కబ్జా చేసిన భార్యాభర్తలను చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనియెడల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -