Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐకమత్యంతో ఉంటూ అభివృద్ధికి కృషి చేయాలి..

ఐకమత్యంతో ఉంటూ అభివృద్ధికి కృషి చేయాలి..

- Advertisement -

ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి 
నవతెలంగాణ – ఆర్మూర్

మున్సిపల్ లో గెలిచిన కౌన్సిలర్లు అందరూ ఐకమత్యంతో ఉంటూ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. పట్టణంలోని రైతు వేదికలో సోమవారం  కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ,రంజన్ గిఫ్ట్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో అన్ని మతాల వారు ఎక్కడ కూడా ప్రశాంతంగా లేరు అని, కేవలం భారత దేశంలో మాత్రమే అన్ని వర్గాల వారు భయం లేకుండా రక్షణ వ్యవస్థ లో సంతోషంగా ఉన్నారని అన్నారు.

102దేశాలతో భారత దేశం కు మంచి సంబంధాలు ఉన్నాయి అని ,దేశం ముక్యం అని కులాలు మతాలు కాదు అభివృద్ధి కావాలి అంటే ఐక్యంగా ఉంటే మాత్రమే అభివృద్ధి సాధ్యం అని గెలిచిన కౌన్సిలర్లు అందరికి తన తరుపున ప్రత్యేక శుభాకాంక్షలు అని అన్నారు. అభివృద్ధి జరగాలి అంటే అన్ని పార్టీల వారు వస్తె సాధ్యం అని అన్నారు .50 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి,15మంది లబ్ధిదారులకు షాది ముబారక్ చెక్కులు అందజేశారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లహరి, వైస్  ఛైర్మన్ వెంకట్ రెడ్డి, బిజెపి పట్టణ అధ్యక్షుడు మందుల బాలు,యమాద్రి భాస్కర్, తహసిల్దార్ సత్యనారాయణ, 23వ వార్డు కౌన్సిలర్ అన్నారపు రాజు (బొట్టు రాజు) తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -