- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలోని కేరళ ఇమీ హై స్కూల్ విద్యార్థి పి ఆరాధ్యకు ఏకలవ్య ఐఐటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అవార్డు సాధించింది. ఆదివారం దోమలగూడ రామకృష్ణ మఠం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ జయప్రకాష్ నారాయణ, ఐ ఏ ఎస్ ఆకెళ్ళ రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఆరధ్య ఐఐటి స్టేట్ ప్రథమ అవార్డు , ద్వితీయ శ్రేణి అవార్డు ఎల్ వైష్ణవి, రామ్ చరణ్,సాయి హవీష్ లు అందుకున్నట్లు పాఠశాల చైర్మన్ , ప్రిన్సిపాల్ రాజేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అవార్డు పొందిన విద్యార్థులను ప్రిన్సిపాల్ రాజేందర్ , సెక్రటరీ కరస్పాండెంట్ శైలేందర్, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.
- Advertisement -



