Thursday, March 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్

అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్

- Advertisement -

– విక్రయాలు చేస్తున్న ముగ్గురిపై కేసు
నవతెలంగాణ – కాటారం

కాటారం మండల కేంద్రంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లలో ఫిల్లింగ్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై ఆకుల శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కడవాస రాజకుమార్ కాటారం మండలం గారేపల్లి గ్రామంలో నివాసం ఉంటూ గ్యాస్ సిలిండర్లలో అక్రమంగా ఫిల్లింగ్ చేస్తూ వ్యాపారం సాగిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందడంతో దాడులు నిర్వహించామని, గ్యాస్ ఫిల్లింగ్‌కు ఉపయోగించే యంత్రంతో పాటు మూడు గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్న మన్నారు.

గారేపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు సుధాకర్, రమేష్ అనే మరో ఇద్దరు యువకులు రాజకుమార్ వద్ద గ్యాస్ కొనుగోలు చేసి వాటిని అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. వారి వద్ద నుంచి నాలుగు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని, రాజకుమార్, సుధాకర్, రమేష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేసి విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -