Friday, March 13, 2026
E-PAPER
Homeఆదిలాబాద్జన్నారం మండలంలో కుక్కల స్వైర విహారం

జన్నారం మండలంలో కుక్కల స్వైర విహారం

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని ఫోన్ కాల్ కిష్టాపూర్ దేవుని గూడా రాంపూర్ తదితర గ్రామాల్లో కుక్కల స్వైర విహారం ఎక్కువగా ఉండడంతో చిన్నారులు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు వృద్ధులు రోడ్డుపై రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో రాంపూర్ గ్రామంలో ఒక వృద్ధురాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఆమెపై దాడి చేసి తీవ్ర గాయాలు చేశాయి. గురువారం మండలంలోని దేవుని గూడా కిష్టాపూర్ గ్రామంలో కూడా పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తూ దేవుని కూడా గ్రామానికి చెందిన ఇద్దరు చిన్న పిల్లలపై దాడులు చేశాయి.

దీంతో చిన్నపిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గురువారం కిష్టాపూర్ గ్రామానికి చెందిన మూగల మహేష్ పై పిచ్చికుక్కలు దాడి చేసి తీవ్ర గాయాలు చేశాయి. అతని వారి కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిచ్చికుక్కలు ఇళ్లలో ఉండే మనుషులపైనే కాకుండా ఇండ్లలో పెంచుకునే కుక్కల పైన కూడా దాడులు చేసి దయాలపాలు చేస్తున్నాయి. అధికారులు స్పందించి గ్రామాల్లో పిచ్చికుక్కల బెడద నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -