- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని రేషన్ కార్డు సభ్యులందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని స్తానిక రేషన్ డీలర్ పవన్ కంబ్లే వాట్సాప్ ద్వారా వినియోగదారులకు తెలిపారు. పాత వారితో పాటు కొత్త రేషన్ కార్డులు పొందిన వారు కూడా ఈ నెల 31 లోపు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ కేవైసీ కోసం రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కూడా తప్పనిసరి అని చెప్పారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలోని రేషన్ దుకాణాలలో ఈ వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ కేవైసీ చేయించుకోని వారు రేషన్ బియ్యం అందుకోలేరని ఆయన స్పష్టం చేశారు.
- Advertisement -



