- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణంలోని మోడల్ స్కూల్ యందు శనివారం పదోతరగతి పరీక్షాకేంద్రం వద్ద పాము ప్రత్యక్షం కావడం తీవ్ర కలవరం రేపింది. మొదటిరోజు పరీక్షలకు విద్యార్థిని విద్యార్థులు రాసేందుకు రాగా , తమ రూమ్ నంబర్లు చూసుకునేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపగా, ఒక్కసారిగా పాము ప్రత్యక్షం కావడంతో విద్యార్థులు ఉరుకుల పరుగులు పెట్టినారు. పరీక్ష కేంద్రం వద్ద విధులు నిర్వహించే పోలీసులు పామును చంపివేయగా, పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -



