నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జీ చేయడం అత్యంత ప్రజాస్వామ్య విరుద్ధమైనదనీ, సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ద్వారా సోమవారం స్పందించారు. లాఠీలు, టియర్ గ్యాస్తో ప్రశ్నలకు సమాధానం చెప్పలేరని తెలిపారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికీ ప్రశ్నించే హక్కును కల్పించిందనీ, ఆ హక్కును బలప్రయోగంతో అణచివేయలేరని పేర్కొన్నారు. పోలీసుల లాఠీచార్జీని తీవ్రంగా ఖండించారు. విభేదించే స్వరాలను అణచివేయడం కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. జవాబుదారీతనం కోసం పోరాడుతున్న ప్రతి విద్యార్థికీ, ప్రతి పౌరుడికీ ఆయన సంఘీభావం ప్రకటించారు.
ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీ సిగ్గుచేటు : కేటీఆర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



