నవతెలంగాణ – అశ్వారావుపేట
రాయితీ పై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమం లో భాగంగా స్థానిక శాసన సభ్యులు శ్రీ జారే ఆదినారాయణ ఆదేశాలు మేరకు అశ్వారావుపేట, నారాయణపురం ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు లో అశ్వారావుపేట లో 50 క్వింటాళ్ల జీలుగ ,60 క్వింటాళ్ల జనుము, నారాయణపురం నందు జీలుగ 50 క్వింటాళ్ల, 40 క్వింటాళ్ల జనుము రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది అని మండల వ్యవసాయ అధికారి శివరాం ప్రసాద్ శుక్రవారం తెలిపారు. జీలుగ 30 కేజీల బస్తా పూర్తి ధర రూ.4275 లు ఉండగా రాయితీ 2137.50 లు, రైతు వాటా రూ.2137.50 లు, జనుము 40 కేజీల బస్తా పూర్తి ధర రూ. 5020 లు,సబ్సిడీ రూ.2510 లు, రైతు వాటా రూ.2510 లు ఉంటుందని తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారి దగ్గర కూపన్ పొంది రైతు వాటా సొసైటీ నందు చెల్లించి విత్తనాలు పొందవచ్చు అన్నారు.కావున అశ్వారావుపేట మండల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అందుబాటులో రాయితీ పచ్చిరొట్ట విత్తనాలు : ఎంఏవో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES