Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ ను రద్దు చేయాలి

గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ ను రద్దు చేయాలి

- Advertisement -

ఉమ్మడి మండలాలకు ఏదుల రిజర్వాయర్ చాలు
అఖిల పక్ష ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్
ఏదులలో అఖిల పక్ష పోరాట కమిటీ ధర్నాకు మద్దతు
నవతెలంగాణ – వనపర్తి

గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ ను రద్దు చేయాలని, ఉమ్మడి మండలాలకు ఏదుల రిజర్వాయర్ సరిపోతుందని అఖిల పక్ష ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ అన్నారు. ఏదుల మండలంలో గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ కు వ్యతిరేకంగా అఖిల పక్ష పోరాట కమిటీ చేస్తున్న ధర్నాకు అఖిల పక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు మద్దతు పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 78 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న గొల్లపల్లి-చీర్కపల్లి నిర్వాసితులకు అఖిల పక్ష ఐక్యవేదిక సంపూర్ణ సంఘీభావం తెలుపుతున్నామని చెప్పారు.

ఉదయం 9 గంటలకే ఆక్కడ టెంట్ లో నిర్వాసితులు ధర్నా చేయడాన్ని చూసి ఆశ్చర్యపోయామని, ఇంత ఉదయమే ధర్నాలో కూర్చున్న వారి పట్టుదలకు , వారికున్న బాధను చూసి చలించిపోయామన్నారు. పక్కనే ఏదుల రిజర్వాయర్ ఉన్నందున మరొక రిజర్వాయర్ అవసరం లేదంటున్న ఆరు గ్రామాల ప్రజలతో ఎమ్మెల్యే, కలెక్టర్ లు చర్చించి సమస్య పరిష్కరించాలని, అలాగే ప్రభుత్వానికి నివేదించాలని ఆయన కోరారు. పక్కనే ఉన్న ఏదుల రిజర్వాయర్ ఉమ్మడి మండలాలకు వనపర్తి జిల్లాకు సరిపోతుందన్నారు. పక్కపక్కనే రెండు రిజర్వాయర్లు ఉండకూడదని, గత ప్రభుత్వంలో ఈ రిజర్వాయర్ ముందుకు తెచ్చినప్పటికీ, సీఎం, ఇంజనీర్లు వద్దనడంతో దాన్ని వెనక్కి తీసుకున్నారని చెప్పారు. 

మరి మీరు ఎందుకు ముందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. అవసరమైతే తూము ద్వారా నీటిని మళ్లించొచ్చని నిపుణులు తెలుపుతున్నారని చెప్పారు.  అలాకాకుండా ముందుకు వెళితే ప్రజలు ఆరోపించినట్లు కమిషన్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తేటతెల్లమవు తుందని ఆరోపించారు. ఈ సందర్బంగా బి.ఎస్.పి కంటెస్టడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మైబుస్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, బిజెపి నాయకులు రవి, బీసీ సంఘం నాయకులు పుట్టపాక బాలు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చీర్కపల్లి గొల్లపల్లి రిజర్వాయర్ వ్యతిరేక కమిటీ అధ్యక్షులు రాములు, చీరకపల్లి, గొల్లపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -