నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలలో సోమవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ ఆదేశానుసారం మద్నూర్ సబ్-ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందం అవగాహనా కార్యక్రమం జరిగింది. ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మంచి లక్ష్యంతో చదువుకోవాలని సూచించారు. ఏచిన్న పొరపాటు చేసిన జీవితాలు నాశనం అవుతాయని, తల్లి తండ్రులు చెప్పినట్టు వినాలని పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు.శేషరావు, పిసి.సాయిలు, మాటలు పాటలు ద్వారా కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ స్వప్న, హెడ్ కానిస్టేబుల్ ఈ. శ్రీనివాస్, డబ్లు పీసీసుజాత, హెచ్ జి. హేమాద్రి, షి టీమ్ సభ్యులు పి సి.అనిల్, డబ్లు పిసి.పార్వతి, ఉపధ్యాయు బృందం మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు. షి టీమ్ నం 8712686094 సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930 అత్యవసర సమయంలో డైల్ 100 కాల్ చేయాలని సూచించారు.
మైనర్ వివాహాలపై అవగాహన కల్పించిన పోలీస్ కళాబృందం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



