– చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి
నవతెలంగాణ – హనుమకొండ చౌరస్తా
హనుమకొండ జిల్లా కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఓ హాస్టల్లో కొందరు సీనియర్లు జూనియర్స్పై దాడి చేసిన ఘటనలో మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేయగా మంగళవారం మృతిచెందింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకి చెందిన కృష్ణబాబు, అంజమ్మ కుమార్తె శ్రీవిద్య(20) కేయూలో ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతోంది. పద్మాక్షి హాస్టల్ బీ బ్లాక్లో ఉంటోంది. అదే హాస్టల్లో ఉంటున్న సీనియర్లకు శ్రీవిద్యకు మధ్య ఓ విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో శ్రీవిద్యపై ఆరుగురు సీనియర్లు దాడి చేయడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్టల్కు వచ్చి విచారణ చేపట్టి సయోధ్య కుదిర్చారు. ఈ ఘటన అనంతరం తల్లిదండ్రులు వచ్చి శ్రీవిద్యను ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం ఏపీలోని గంపలగూడెంలో తమ అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిన శ్రీవిద్య ఈ నెల 7, 8వతేదీన రెండుసార్లు ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. సమీపంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు మధిర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మనస్తాపంతో కేయూ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



