– మూసీ ప్రక్షాళనపై సర్కారు ద్వంద్వ వైఖరికి నిరసన
– డీపీఆర్ అసెంబ్లీలో పెట్టాలి : కేటీఆర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మూసీ ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. దానిపై మంత్రి శ్రీధర్బాబు సమాధానం తర్వాత లోపలికి వచ్చారు. అంతకు ముందు కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మూసీప్రక్షాళనపై దాటవేత ధోరణి ప్రదర్శిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం దగ్గర పైసలు లేవనీ, ప్రణాళికలు లేవని ఆరోపించారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదు.. లక్షన్నర కోట్ల దోపిడీకి మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టు కోసం రుణం మంజూరైందని గతంలో మంత్రి చెప్పారని తెలిపారు. డీపీఆర్ తయారీకి 18 నెలల సమయం పడుతుందని చెప్పిన ప్రభుత్వం…రెండున్నర నెలల్లో ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రూ.16వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు లక్షన్నర కోట్లు ఎందుకని నిలదీశారు. ఆ ప్రాజెక్టులో బఫర్ జోన్ ఎంత అని ప్రశ్నించారు. పునరుజ్జీవం ప్రాజెక్టుతో వేలాది మంది నష్టపోతున్నారని తెలిపారు. ఆ ప్రాజెక్టుతో రేవంత్ సర్కార్ గృహ మేధ యాగం చేస్తోందని ఆరోపించారు. బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలకు కాంట్రాక్టు ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు. డీపీఆర్ లేకుండా హడావిడిగా ఇండ్లు ఎందుకు కూలుస్తున్నారని అడిగారు.
సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



