- Advertisement -
నవతెలంగాణ – మునిపల్లి
మండల పరిధిలోనిమల్లికార్జున్ పల్లి గ్రామంలో బోనాల పండుగను గ్రామ సర్పంచ్ మల్లేశం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి ఎస్ఐ అరవింద్ పాల్గొని పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. కాగా బోనాలను మహిళలు ఎత్తుకొని పురవీధుల గుండా డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవతకు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, గ్రామస్తులు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



