నవతెలంగాణ – బోనకల్
వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం దాతలు చలివేంద్రాలను ఏర్పాటు చేయటం అభినందనీయమని ఈగల్ ఫోర్స్ ఖమ్మం జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్ వి విజయ్ రామ్ కుమార్, మండల తహసిల్దార్ మద్దెల రమాదేవి, బోనకల్ ఎస్సై పొదిలి వెంకన్న, ఎంపీడీవో రురావత్ రమాదేవి అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ గ్రామానికి చెందిన వివి గార్డెన్ ఫంక్షన్ హాల్ అధినేత వెన్నబోయిన వెంకటేశ్వరరావు, బోనకల్ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యుడు షేక్ మీరా సాహెబ్, బోనకల్ గ్రామానికి చెందిన బోడ యోగి మండల కేంద్రంలో మూడు ప్రధాన సెంటర్లలో వేసవికాలంలో ప్రజల దాహార్తి తీర్చడం కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.
బోనకల్ గ్రామపంచాయతీ కార్యాలయము వద్ద ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని మండల తహసిల్దార్ మద్దెల రమాదేవి, స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్లో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఈగల్ ఫోర్స్ ఖమ్మం జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్ వి విజయ్ రామ్ కుమార్, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎంపీడీవో రురావత్ రమాదేవి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముగ్గురు దాతలు ముందుకు వచ్చి ప్రజల దహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయటం మంచి శుభ పరిణామం అన్నారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య, బోనకల్ సర్పంచ్ బానోతు జ్యోతి, పెద్ద బీరవల్లి సర్పంచ్ చింతల చెరువు కోటేశ్వరరావు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కిలారు సురేష్, మధిర డిప్యూటీ డిఆర్ఓ నిమ్మ తోట వెంకటలక్ష్మి, ఉప సర్పంచ్ బానోతు కొండ, బోనకల్ గ్రామపంచాయతీ కార్యదర్శి కోలా రాజేశ్వరి, ఐసిడిఎస్ సూపర్వైజర్ పంతంగి రమాదేవి, హెల్త్ సూపర్వైజర్ టి స్వర్ణమార్తమ, బోనకల్ మాజీ సర్పంచ్ పోటు వెంకటేశ్వర్లు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.



