- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోడీ శుక్రవారం సాయంత్రం అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం ఇదే. యుద్ధ ప్రభావం వల్ల తలెత్తే ఇంధన కొరత, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో రాష్ట్రాల సన్నద్ధతపై చర్చించనున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీకి హాజరు కాలేకపోవచ్చు.
- Advertisement -



