నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని తాజ్ పూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం – యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలకు చెందిన గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమ విద్యార్థులు (RAWEP 2025 – 26) రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్బంగా డా. ఎం. గోవర్ధన్ ( రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అస్సోసియట్ డీన్ ) మాట్లాడుతూ ముందుగా తాజ్ పూర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో తమ కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంశోషకరం అన్నారు. వ్యవసాయ విద్యలో భాగంగా విద్యార్థులకు 3 సంవత్సరాల చదువు తరువాత విద్యార్థులు అంత ఒక గ్రామాన్ని ఎన్నుకొని అక్కడ ఒక 6 నెలల పాటు రైతులతో ఉంటూ వారికి పంట పొలాల్లో టెక్నాలజీ పరంగా కానీ మరే ఇతర వ్యవసాయానికి సంబంధిన సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు ఉపయోగపడుతూ, విద్యార్థులకు తెలియని విషయాలు రైతుల దగ్గర నేర్చుకుని వారు చదువుకున్న చదువును రైతు సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తారని తెలిపారు.
విద్యార్థులు ఏర్పాటు చేసిన రైతు సందర్శన చాల బాగుందని వారు విద్యార్థులను అభినందించారు. అదేవిధంగా రైతుల నుండి విద్యార్థుల పై ప్రశంసలను చూస్తుంటే వారిని గ్రామ రైతులు కుటుంబ సభ్యులుగా స్వీకరించడం చూసి వారికీ ఆనందంగా ఉందని తెలిపారు. ప్రస్తుత యువత సోషల్ మీడియాకి బానిసలూ కాకుండా వ్యవసాయ క్షేత్రంలోకిరావాలన్నారు. యువత రైతుగా మారితే వారు చదువుకున్న చదువుతో వ్యవసాయ రంగంలో కొత్త మార్పులు తీసుకురావొచ్చని ఇ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, డా. డి. శ్రీలత (యాదాద్రి భువనగిరి జిల్లాలో టి ఆర్ వి కె కు ప్రధాన శాస్త్రవేత్త), శ్రీనివాస్, మండల రైతులు కంచి మల్లయ్య, ఉప సర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, ఎస్కే గాలిబి యాకుబ్, బొమ్మరపు రామకృష్ణ, బొమ్మారపు లక్ష్మీ బాలరాజు, బిట్కూరు మహేష్, వరిగంటి మానస నాగరాజు, హైమద్, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, భువనగిరి మండల పరిధి గ్రామ పంచాయతీ పరిధిలోని రైతులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.



