- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలోని జనతా గ్యారేజ్ కార్యక్రమంలో భాగంగా క్రైమ్ నెం. 23లో ప్రీమియర్ అపార్ట్మెంట్ పక్కన వాటర్ ట్యాంక్ నిర్మాణంపై కాలనీ వాసులు ఆదివారం మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిని కలిసి తమ ఆవేదనను వివరించారు. కాలనీ వాసులను పోలీసులు, అధికారులు బెదిరింపులకు గురిచేస్తున్నారని వారు తెలపగా, ప్రజలపై ఒత్తిడి తేవడం సరికాదని హెచ్చరించారు. వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపడితే కాలనీ వాసులతో కలిసి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
- Advertisement -



