- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ
మండల పరిధిలోని జలాల్ పూర్ గ్రామంలో గల శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని గురువారం డీఎఫ్ఓ చంద్రశేఖర్, ఎఫ్ ఆర్ ఓ అరుణ్ కుమార్, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ రణవీర్, ఫారెస్ట్ ఆఫీసర్ గంగాధర్ సందర్శించారు. అనంతరం రంగనాథ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు ధ్యాగ నర్సారెడ్డి ఫారెస్ట్ అధికారులను శాలువాతో ఘనంగా సన్మానించారు.
- Advertisement -



