Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి

ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

• సర్పంచ్ ధరావత్ సోమి రమేష్ 
నవతెలంగాణ -పెద్దవంగర 
గ్రామంలో అమలు అవుతున్న ఉపాధి హామీ పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ధరావత్ సోమి రమేష్ అన్నారు. మండలంలోని పడమటి తండాలో బుధవారం ఉపాధి హామీ పనులను సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ద్వారా కార్మికులకు నిరంతర ఉపాధి లభిస్తుందని తెలిపారు. పనులు అందుబాటులో ఉన్నప్పుడు కార్మికులు చురుకుగా పాల్గొని ఆర్థికంగా లాభపడాలని కోరారు. నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, గ్రామ అభివృద్ధికి సంబంధించిన పనుల్లో పాల్గొనడం ద్వారా గ్రామాల అభివృద్ధికి కూడా తోడ్పడవచ్చని చెప్పారు.

ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత, నాణ్యత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో  ఉపసర్పంచ్ భూక్యా కాంతమ్మ, పంచాయతీ కార్యదర్శి పావని, టీఏ యాకయ్య, వార్డు సభ్యులు ధరావత్ చిరంజీవి, ధరావత్ లక్ష్మణ్, ధరావత్ నీల, కారోబార్ ధరావత్ సోమన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -