Thursday, June 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజకీయాలకు అతీతంగా పథకాలను అందజేయాలి

రాజకీయాలకు అతీతంగా పథకాలను అందజేయాలి

- Advertisement -
  • ఇందిరమ్మ ఇండ్లు,రాజీవ్ యువ వికాసం అర్హులకు ఇవ్వాలి
  • సీపీఐ(ఎం) హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు గూగులోతు శివరాజ్
    నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్  : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, కొత్త రేషన్ కార్డులను అందరికీ వర్తింప చేయాలని సీపీఐ(ఎం) నియోజకవర్గ నాయకులు శివరాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం హుస్నాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల పేర్లను ఎంపిక చేస్తున్నారని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాలలో అట్టడుగున ఉన్న పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లును మంజూరు చేయాలన్నారు. అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలని అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి రాష్ట్రంలో దాదాపు 16 లక్షల మంది నిరుద్యోగ యువతీ, యువకులు ఆన్లైన్లో నమోదు చేసుకోన్న వారందరికీ యూనిట్లను ఇవ్వాలన్నారు. ఈ పథకంలోనూ అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన కార్యకర్తలు, నాయకుల పేర్లను ఎంపిక చేస్తున్నారని, అర్హులైన నిరుద్యోగ యువతను పక్కన పెట్టడం దారుణం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పథకం ప్రారంభానికి ఒక మాట తర్వాత ఒక మాట మాట్లాడుతూన్నారాన్నారు. పథకాల్లో స్పష్టత లేకుండానిరుద్యోగులలో గందరగోళం సృష్టింస్తున్నారాన్నారు. సిబిల్ స్కోర్ ఉంటేనే ఇస్తామని షరతులు పెట్టి నిరుద్యోగ యువతను మోసం చేస్తుందన్నారు. బ్యాంకులతోటి సంబంధం లేకుండా నేరుగా అర్హులైన నిరుద్యోగ యువత అందరికీ రాజీవ్ యువ వికాసం పథకాన్ని వర్తింపజేసి యూనిట్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పథకాల అమలులో కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల జాబితాను అధికారులు చేపట్టాలని డిమాండ్ చేశారు.  ప్రజలకు ఆశ చూపి మభ్యపెట్టకుండా అర్హులైన పేదవారందరికీ ముందుగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు,రాజీవ్ యువ వికాసం యూనిట్లను అందించి పేదల అదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ లబ్ధిదారుల ఎంపికలో అవినీతికి తావు లేకుండా రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల లిస్ట్ ఫైనల్ చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల పేద ప్రజల పక్షాన పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) నాయకులు గుగులోతు రాజు నాయక్, భూక్య భాస్కర్, జి రాజులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -